ఖమ్మం 36వ డివిజన్ రజక వీధిలో సీసీ రోడ్డు, డ్రైనేజీ నిర్మాణ పనులకు కార్పొరేటర్ పసుమర్తి రామ్మోహన్ రావు గురువారం శంకుస్థాపన చేశారు. మున్సిపల్ జనరల్ ఫండ్ నుంచి సుమారు రూ.12 లక్షల వ్యయంతో పనులు చేపట్టినట్లు తెలిపారు. డివిజన్ సమగ్ర అభివృద్ధే తన లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు వెచ్చా సీతారాములు, కురువెల్ల వేణుగోపాల్ ఉన్నారు.