TG: కామారెడ్డిలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల, అరోరా భూములపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలతో ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి, నేత షబ్బీర్ అలీ మధ్య సవాళ్లు చెలరేగాయి. ఇవాళ ఉదయం 10 గంటలకు శిశుమందిర్ వద్ద చర్చకు రావాలని ఎమ్మెల్యే సవాల్ చేయగా, కాంగ్రెస్ ‘సై’ అంది. ఇరు వర్గాల పోటాపోటీ సవాళ్లతో కామారెడ్డిలో హైటెన్షన్ నెలకొనగా, పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.