MNCL: దాడి కేసులో నలుగురిపై కేసు నమోదు చేసినట్లు SI ప్రసాద్ తెలిపారు. నెన్నెల మండలంలోని చిత్తపూర్ గ్రామానికి చెందిన భార్యభర్తలు చెల్కల భాస్కర్, మల్లక్కపై శుక్రవారం అదే గ్రామానికి చెందిన వేముల రాజేష్, శంకరి,మల్లయ్య, సంపత్ దుర్భాషలాడి దాడి చేసి చంపుతామని బెదిరించారు. భార్యభర్తల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై పేర్కొన్నారు.