E.G: కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద గల రజకుల రేవులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని గురువారం స్థానికులు గుర్తించారు. మృతుడి వయస్సు 50 నుంచి 55 ఏళ్లు ఉంటుందని భావిస్తున్నారు. ఘటనా స్థలంలో AP 16 AU 9250 నంబర్ గల బజాజ్ ప్లాటినా బైక్ లభించింది. దానిపై పి.వేంకటేశ్వర రావు అని ఉందని స్థానికులు తెలిపారు.