ప్రకాశం: నడికుడి-కాళహస్తి రైల్వే లైన్ నిర్మాణంలో భాగంగా పామూరు మండలంలో పనులు వేగంగా జరుగుతున్నాయని కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. ఇటీవల కనిగిరి వరకు పనులు పూర్తి చేసి ట్రైన్ ట్రయల్ కూడా విజయవంతంగా నిర్వహించారు. వచ్చే ఏడాది నాటికి పామూరు వరకు నిర్మాణాలు పూర్తి చేయించి రైలు నడిపిస్తామని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు.