KMR: నిజాంసాగర్ ప్రాజెక్టు నుంచి పంట సాగు కోసం ప్రధాన కాలువ ద్వారా 3వ విడతలో భాగంగా శనివారం 1,800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈఈ సాకేత్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 14.045 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. రైతులు నీటిని పొదుపుగా వాడుకోవాలని అధికారులు కోరారు.