GNTR: అసెంబ్లీ, సచివాలయంలో పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికుల జీతాలు పెంచాలని కోరుతూ సీఐటీయూ నేతలు బుధవారం సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబుకు వినతిపత్రం అందించారు. పెరుగుతున్న ధరలకు ప్రస్తుతం ఇస్తున్న రూ. 12 వేల వేతనం ఏమాత్రం సరిపోవడం లేదని, కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.