KDP: కొండాపురం మండలం డొంకపల్లి గ్రామంలోని ఆశ్రమం గుడి వెనుక పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు బుధవారం దాడి చేశారు. ఎస్సై జయరాములు తన సిబ్బందితో కలిసి నిర్వహించిన ఈ సోదాల్లో ఏడుగురు జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.13,040 నగదును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్సై తెలిపారు.