PLD: 2026-27 విద్యా సంవత్సరం నుంచి పిడుగురాళ్ల ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రారంభించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ బుధవారం శాసనసభలో ప్రకటించారు. ఇందులో 100 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు, 420 పడకలతో కూడిన బోధనా ఆసుపత్రిని ఏర్పాటు చేస్తున్నామన్నారు. దీనికోసం 237 మంది డాక్టర్లు, 600 మంది సిబ్బందిని నియమించనున్నట్లు ఆయన తెలిపారు.