AP: కాకినాడ జిల్లా వేట్లపాలెం పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 26కు చేరింది. జీజీహెచ్లో చికిత్స పొందుతూ కాతేటి శ్రీను(33) మృతి చెందాడు. ఇవాళ ఒక్కరోజే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ముగ్గురు మృతి చెందారు. 70-100 శాతం కాలిన గాయాలు, మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్తో బాధితుల ఆరోగ్యం విషమిస్తోంది. జీజీహెచ్లో మరో ముగ్గురు క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు.