శ్రీకాకుళం నగరంలో డయేరియాకు బాధ్యుడ్ని చేస్తూ సస్పెండ్ చేసిన కార్పొరేషన్ కమిషనర్ కూర్మారావును మళ్లీ కమిషనర్ సీట్లోకి తెచ్చే ప్రయత్నాలు జోరందుకున్నాయని విశ్వసనీయంగా తెలిసింది. ఇంచార్జి కమీషనర్గా జేసీ వ్యవహరిస్తున్నారు. సస్పెండ్ అయిన కమీషనర్కి ‘సమర్థుడు’ అనే ఇమేజ్, అన్యాయంగా ‘బలి పశువును’ చేశారనే సానుభూతి, కూటమి నేతల సపోర్ట్ ఉన్నాయి.