HYD: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆరోగ్య శాఖ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై సెక్రటేరియట్లో మంత్రి దామోదర రాజనర్సింహ సమీక్ష నిర్వహించారు. మొత్తం 4 దశల్లో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో తొలిదశలో మార్చి 6 నుంచి 31 వరకు మాతా శిశు సంరక్షణ, కౌమార దశ బాలికలు, వృద్ధుల ఆరోగ్య సేవలపై దృష్టి కేంద్రీకరించాలన్నారు.