మంత్రి లోకేశ్ ఏర్పాటు చేసిన ‘డిన్నర్ ఆత్మీయ సమావేశానికి రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ హాజరయ్యారు. కేవలం రాజకీయాలే కాకుండా, చాలా సరదాగా గడిచిన ఈ సమయం మర్చిపోలేనిదని.. ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆదిరెడ్డి తన మనసులో మాట చెప్పారు. మంత్రి లోకేశ్ ఎంతో ఆప్యాయంగా కుటుంబ సభ్యులందరినీ పలకరించారని పేర్కొన్నారు.