దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 76.54 పాయింట్లు లాభపడి 80,787.30 వద్ద స్థిర పడింది. నిఫ్టీ 32.15 పాయింట్ల లాభంతో 24,773.15 దగ్గర ముగిసింది. సెన్సెక్స్ 30 సూచీలో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, టాటా స్టీల్, మారుతీ సుజుకీ, అదానీ పోర్ట్స్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి.