VZM: రైతులకు మేలు జరిగేందుకు వారి తరఫున పోరాడతామని వైసీపీ జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇప్పిలి అనంతం తెలిపారు. చీపురుపల్లిలో రైతు పోరు పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. వైసీపీ ప్రభుత్వంలో ఆర్బీకేల ద్వారా యూరియా పంపిణీ జరిగేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి ఎక్కడా లేదన్నారు.