SDPT: ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటూ ఆరుగాలం కష్టపడి పండించిన రైతులకు కాంగ్రెస్ పాలనలో కష్టాలు తప్పడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ మేరకు నంగునూరు మండలం, ఆరేపల్లి (అక్కెనపల్లి) గ్రామ రైతులు మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరుతూ బుధవారం ఆయనకు వినతి పత్రం అందజేశారు. కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.