KRNL: జిల్లాలోని అన్ని ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో నేటి నుంచి 6 వరకు విజ్ఞాన వారోత్సవాలు నిర్వహించాలని DEO సుధాకర్ ఆదేశించారు. 4న పాఠశాల స్థాయి, 5న మండల స్థాయి, 6న జిల్లా స్థాయి పోటీలు ఉంటాయని తెలిపారు. విద్యార్థులకు పోస్టర్ ప్రదర్శన, క్విజ్, శాస్త్రవేత్తల వేషధారణ, సెమినార్లు నిర్వహించాలన్నారు. విద్యార్థుల్లో వైజ్ఞానిక స్పృహ పెంచాలన్నారు.