TG: ఢిల్లీ పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. కొద్దిసేపట్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కుమారుడి వివాహ వేడుకకు ఆయన హాజరుకానున్నారు. అనంతరం నేరుగా అసెంబ్లీకి వెళ్లనున్న సీఎం.. కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో పాల్గొంటారు. దీంతో ఇవాళ నగరంలో రాజకీయ సందడి నెలకొంది.