శ్రీవిష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ ‘మృత్యుంజయ్’ మార్చి 6న థియేటర్లలోకి రాబోతుంది. హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం కేవలం 1 గంట 58 నిమిషాల తక్కువ రన్ టైంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ చిన్న నిడివి ప్రేక్షకులను అబ్బురపరుస్తుందని చిత్ర యూనిట్ నమ్ముతోంది. ఇక ఈ మూవీలో రెబా మోనికా జాన్ నటించగా, కాల భైరవ సంగీతం అందించారు.