TG: హైదరాబాద్లోని నాగోల్ STPని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సందర్శించారు. గత BRS ప్రభుత్వ హయాంలో మూసీ నది ప్రక్షాళన, అభివృద్ధి కోసం చేపట్టిన పనులను ఆయన ఇతర నేతలతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అప్పట్లో తాము నిర్మించిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ల పనితీరును వివరిస్తూ, ప్రస్తుత ప్రభుత్వ మూసీ ప్రాజెక్టుపై విమర్శలు సంధించారు.