AP: విశాఖలో వైసీపీ కాపు నేతలు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తనపై దాడి చేసి అక్రమంగా జైలుకు పంపారని మాజీమంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. దాడి చేసి కార్లు ధ్వంసం చేశారని అన్నారు. తనను చంపేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేనా కూటమి పాలనా.. జవాబు చెప్పాల్సిన బాధ్యత లేదా? అని ప్రశ్నించారు. అలాగే, తనకు సంఘీభావం తెలిపిన నేతలందరికీ అంబటి ధన్యవాదాలు తెలిపారు.