E.G: జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఛైర్మన్ కిషోర్ మక్వానా మార్చి 6 నుంచి 8 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించనున్నారని కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన రాజమండ్రి చేరుకుంటారని… శనివారం ఎస్సీల సంక్షేమం, రక్షణాత్మక చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు. అనంతరం కోనసీమ జిల్లాకు వెళ్తారని వివరించారు.