NDL: నందికొట్కూరులో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 10న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి శ్రీకాంత్ రెడ్డి ఆదివారం తెలిపారు.10 తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న నిరుద్యోగులు పాల్గొనవచ్చు అని ఎంపికైన వారికి రూ.12వేల నుంచి రూ.22 వేల వరకు జీతం ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.