TPT: ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరసు రామేశ్వర స్వామి వారిని విశాఖపట్నం అడిషనల్ జడ్జ్ సీకే గాయత్రీ దేవి ఆదివారం దర్శించుకున్నారు. ఇందులో భాగంగా ఆలయ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ తీర్థప్రసాదాలు అందజేశారు. తర్వాత వేద పండితులు వేద ఆశీర్వచనాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు అర్చకులు పాల్గొన్నారు.