NZB: ధర్పల్లి మండలం గోవింద్ పల్లిలో ఈనెల 9వ తేదీన ఆయుష్ శాఖ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు జిల్లా ఆయుష్ విభాగం ఇంఛార్జ్ డాక్టర్ గంగా దాస్ తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొనే వారికి యోగా సాధన వల్ల కలిగే లాభాలు, ఔషధ మొక్కల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. ఉచిత వైద్య శిబిరాన్ని గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.