WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని రేలకుంట గ్రామంలో ఇవాళ SDF నిధులతో ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హాజరు కానున్నారు. ఈ విషయాన్ని మండల పార్టీ అధ్యక్షులు చిట్యాల తిరుపతిరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఆయన కోరారు.