WGL: కొమ్మాల జాతర సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు. పరకాల నియోజకవర్గం తన అడ్డా అని, వచ్చే ఎన్నికల్లో తన కుమార్తె సుస్మిత పటేల్ పోటీ చేయడం ఖాయమని ప్రకటించారు. సుస్మిత తనకంటే ధైర్యవంతురాలని, కార్యకర్తలకు సమస్య వస్తే ఎంతటివారినైనా ఎదుర్కొంటుందని భరోసా ఇచ్చారు.