NZB: ముప్కాల్లోని విద్యుత్ శాఖ కార్యాలయంలో బుధవారం లైన్మెన్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఏడీఈ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. క్షేత్రస్థాయిలో విద్యుత్ పనులు చేసే సమయంలో లైన్మెన్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయన పలు సూచనలు చేశారు. ప్రతి ఉద్యోగి అంకితభావంతో కృషి చేయాలని పిలుపునిచ్చారు.