జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన పెంబట్ల-కోనాపూర్ శ్రీ దుబ్బరాజరాజేశ్వర స్వామి ఆలయం సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా మూసివేయనున్నట్టు ఆలయ కార్యనిర్వహాణాధికారి వి. అనూష తెలిపారు. రేపు (ఆదివారం) మధ్యాహ్నం 12 గంటలకు ద్వారబందనం చేసి సోమవారం వేకువజామున సంప్రోక్షణాది కార్యక్రమానంతరం ఉదయం 8 గంటలకు భక్తులకు దర్శనానికి అనుమతి ఉంటుందని EO తెలిపారు.