TPT: క్రీడల్లో యువతను ప్రోత్సహించే దిశగా ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం ఉదయం 6 గంటలకు ‘సండే ఆన్ సైక్లింగ్’ పేరుతో తిరుపతిలో కార్యక్రమం నిర్వహించనున్నారు. రోడ్డు పైన సైక్లింగ్, పలు క్రీడా కార్యక్రమాలు నిర్వహిస్తారు. క్రీడాభిమానులు పాల్గొనాలని శాప్ జిల్లా క్రీడాభివృద్ధ అధికారి షణ్ముఖర్ తెలిపారు.