TG: నాగర్కర్నూల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఇంటర్ పరీక్ష రాసిన 16 ఏళ్ల విద్యార్థిని, కడుపునొప్పితో ఆస్పత్రికి వెళ్లగా అక్కడ బాత్రూంలో మగబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఆ పసికందును తన తల్లితో కలిసి చెత్తబుట్టలో పడేసింది. గమనించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. కేజీబీవీ (KGBV)లో చదువుతున్న ఈ విద్యార్థిని ఉదంతం స్థానికంగా సంచలనంగా మారింది.