KKD: కాకినాడ కలెక్టరేట్లోని వికాస కార్యాలయంలో ఈ నెల 23న భారీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రాజెక్ట్ డైరెక్టర్(పీడీ) లచ్చారావు శుక్రవారం ప్రకటించారు. పదో తరగతి నుంచి ఆపై చదువులు చదివిన 35 ఏళ్ల లోపు అభ్యర్థులు ఈ ఇంటర్వ్యూలకు హాజరుకావచ్చన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలతో ఉదయం 9 గంటలకే వికాస కార్యాలయానికి చేరుకోవాలని ఆయన సూచించారు.