KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ ఆవరణలో బుధవారం నుంచి 10వ తేది వరకు సుందరకాండ పారాయణం నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రతి రోజు సాయంత్రం 5 నుంచి 7 గంటల వరకు సుందరకాండ పారాయణం జరుగుతుందన్నారు. ఈ పారాయణాన్ని ఎం.ఎస్ రామారావు మనవడు డాక్టర్ శ్రీనివాస్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు.