PDPL: గోదావరిఖని మార్కండేయ కాలనీలోని ఓ కుటుంబంలో జరిగిన గొడవలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రామూత్ కొబ్బరికాయలు కొట్టే కత్తితో శుక్రవారం బంధువులు సుమిత్ర, ప్రణయ్, కొమురమ్మపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు క్షతగాత్రులను ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ప్రణయ్ పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్ తరలించారు.