BDK: మతసామరస్యాన్ని చాటుతూ లౌకిక విలువలను కాపాడుకుందాం అని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం రాత్రి పాల్వంచ జామా మసీదులో ఇఫ్తార్ విందుకు ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. రంజాన్ మాస స్ఫూర్తితో రాగద్వేషాలకు దూరంగా ఉండాలని తెలిపారు. సమాజంలో శాంతిని నెలకొల్పుతున్న పవిత్ర రంజాన్ మాసం ప్రజల మధ్య ఐక్యత భావం ఇఫ్తార్ విందు అన్నారు.