కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ల వీరేశ్వరస్వామి ఆలయంలో అక్టోబరు నెలకు సంబంధించిన నిత్య కల్యాణ టికెట్స్ విడుదల చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ సత్యనారాయణ తెలిపారు. 31 రోజుల 3,596 కల్యాణాలకు ఆన్లైన్లో 2,128, కార్యాలయంలో 1,468 అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. భక్తులు నేరుగా లేదా ఆన్లైన్లో కాని నమోదు చేసుకోవచ్చని తెలిపారు.