శ్రీకాకుళంలోని అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారికి ఒక్క రోజు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అధికారులు వెల్లడించారు. టికెట్లు రూపేనా రూ.1,33,500, విరాళాల రూపంలో రూ.57,377, ప్రసాదాల రూపంలో రూ.1,50,175 శ్రీ స్వామి వారికి ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో ప్రసాద్ పేర్కొన్నారు. ఆదివారం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామిని దర్శించుకున్నారని ఈవో చెప్పారు.