VSP: విశాఖపట్నం సమీపంలోని రుషికొండ బీచ్లో ఆదివారం మధ్యాహ్నం ప్రమాదం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్కు చెందిన ఆరుగురు పర్యాటకులు సముద్ర స్నానానికి వెళ్లి అలల ఉద్ధృతికి కొట్టుకుపోతుండగా.. అప్రమత్తమైన లైఫ్గార్డ్స్ వారి ప్రాణాలను కాపాడారు. బస్సులో వచ్చిన 15 మంది యువతీ, యువకులు గల బృందం రుషికొండ బీచ్ను సందర్శించారు.