KNR: కరీంనగర్ 2 డిపో నుంచి, ఈనెల 6న గోవా టూర్ ప్యాకేజీ ఏర్పాటు చేసినట్లు, డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. టూర్ ప్యాకేజీలో ఉడిపి, ముఖంబికా అమ్మవారి దర్శనం, మృడేశ్వర్, గోకర్ణ టెంపుల్స్ దర్శనం, గోవా బీచ్ లో ముఖ్య ప్రదేశాలు ఉన్నాయని అన్నారు. మార్చి 6న సా.4 గం.కు KNR నుంచి బయలుదేరి తిరిగి ఈనెల 10న కరీంనగర్ చేరుకుంటుందని తెలిపారు.