NDL: పాణ్యం మండలలో ప్రజా సమస్యల వేదికలో NSUI జిల్లా అధ్యక్షుడు బత్తిని ప్రతాప్ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డికి వినతిపత్రం అందజేశారు. జిందాల్ రహదారిపై బొగ్గు లారీల దుమ్ము వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని శుక్రవారం తెలిపారు. అలాగే పాణ్యం బస్టాండ్లో బస్సులు ఆపకపోవడం సమస్యను వివరించారు. ఎమ్మెల్యే అధికారులకు ఫోన్ చేసి త్వరలో పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.