PDPL: జిల్లాలో ఇంటీరియర్ డిజైనింగ్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు ప్రారంభించనున్నట్లు మహిళా, శిశు, వికలాంగుల, వయో వృద్ధుల సంక్షేమ శాఖ తెలిపింది. ఈ కోర్సులకు జ్యోతినగర్, NTPC, గోదావరిఖనిలో ఈ శిక్షణ ఇస్తారు. ఇంటర్ పాసైన యువత దీనికి అర్హులు, ఆసక్తిగల అభ్యర్థులు జూలై 8 లోపు జిల్లా సంక్షేమాధికారి కార్యాలయ గది నం. 114లో దరఖాస్తులు సమర్పించాలని తెలిపారు.