TG: గతంలో కార్పొరేట్ శక్తులకు BRS రాజ్యసభ అవకాశం ఇచ్చిందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. తెలంగాణ కోసం పని చేసిన వాళ్ళలో ఒక్కరికైనా రాజ్యసభ అవకాశం ఇచ్చిందా? అని ప్రశ్నించారు. మార్చి నెలలో కొన్ని కార్పొరేషన్ పదవులు ఇస్తామన్నారు. వీటిపై కసరత్తు జరుగుతోందన్నారు. కేరళలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు.