JGL: బంజారాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాలలోని బంజారా భవన్లో శుక్రవారం సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన బంజారా సర్పంచ్లను ఘనంగా సన్మానించారు.