భారత గోల్డ్ లోన్ మార్కెట్లో ఆసక్తికర మార్పులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ధనవంతులు కూడా వ్యాపార పెట్టుబడుల కోసం బంగారాన్ని తాకట్టు పెట్టేందుకు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా రూ.5 లక్షలకు పైగా రుణాలు మూడింట ఒక వంతు పెరిగాయి. ఇది బంగారం తాకట్టుపై ఉన్న పాత సామాజిక ఆంక్షలను తొలగిస్తూ, రుణాలు తీసుకోవడం ఒక కొత్త వ్యాపార వ్యూహంగా మారిందని నివేదికలు చెబుతున్నాయి.