ADB: నార్నూర్ మండలం గుండాలలో విషాదం చోటుచేసుకుంది. మద్యం సేవించవద్దని కుమారుడు మందలించినందుకు మనస్థాపానికి గురైన జంగు(41) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం.. మద్యం విషయంపై కుమారుడు మందలించడంతో జంగు పురుగుల మందు తాగినట్లు తెలిపారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పేర్కొన్నారు.