WGL: గీసుకొండ మండలం కొమ్మాల గ్రామంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాలు నేడు ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. జాతర ప్రధాన ఘట్టమైన ప్రభ బండ్ల ఊరేగింపు ఇవాళ ఉదయం జరగనున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. దీంతో హోలీ పండగ సందర్భంగా వివిధ జిల్లాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చి.. స్వామివారిని దర్శించుకోనున్నారు.