KNR: సైదాపూర్ మండలం లస్మన్నపల్లి గ్రామంలో అర్థరాత్రి 12 గంటల వరకు రాములోరి శోభాయాత్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు కోలాటం నృత్యాలతో గ్రామస్తులను అలరించారు. అలాగే హనుమాన్ దీక్షాపరులు తమ భక్తజన పాటలతో గ్రామస్థులను ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్థుల భారీ సంఖ్యలో పాల్గొన్నారు.