AP: అల్లూరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ముంచంగిపుట్టులో నాగేశ్వరరావు అనే వ్యక్తిని దుండగులు గొంతుకోసి చంపేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలను ఏర్పాటు చేశారు. కాగా, కొన్నాళ్లుగా మహిళతో నాగేశ్వరరావు సహజీవనం చేస్తున్నట్లు సమాచారం.