SRD: కేతుగ్రస్తు చంద్రగ్రహణం సందర్భంగా ఝరాసంగం మండల కేంద్రంలోని శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి ఆలయాన్ని ఈరోజు ఉదయం తాత్కాలికంగా మూసివేశారు. ఇవాళ మబ్బున 5 గంటలకు పార్వతి సమేత సంగమేశ్వర స్వామికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి మంగళ హారతులు ఇచ్చినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. అయితే ప్రస్తుతం భక్తుల దర్శనాలు నిలిపివేశామన్నారు. ఆలయ సిబ్బంది ఉన్నారు.