VZM: గుర్ల మండల కేంద్రంలో అంగన్వాడీ కార్యకర్తలు మంగళవారం నిరసన కార్యక్రమం చేపట్టారు. విజయవాడలో అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న నిరసనను ప్రభుత్వం అణచివేసిందని CITU నేత అంబళ్ల గౌరీ నాయుడు అన్నారు. అంగన్వాడీ కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో 100 మంది అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.